నెల్లూరు,జనవరి3: రాష్ట్ర వ్యాప్తంగా 4.3 లక్షల కుళాయి కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు పురపాలకశాఖామంత్రి నారాయణ తెలిపారు. గురువారం మంత్రి మున్సిపల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 83 వేల కనెక్షన్లు ఆన్లైన్ చేసినట్లు అధికారులు వివరించారు.ఈనెలాఖరులోగా అన్ని మున్సిపాలిటీలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆధికారులను ఆదేశించారు.