బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 41మంది దుర్మరణం పాలైయ్యారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని సావో పాలో నగరానికి 350 కిలో మీటర్ల దూరంలో టాగూయ్ నగర సమీపంలో ఓ టెక్స్టైల్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో 37మంది మృతి చెందగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. మరణించిన వారి దేహాలను బయటకు తీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది.