(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అదిగదిగో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చేస్తున్నాయ్..! ఇక జగన్కు మూడింది..! అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. హా.. చంద్రబాబు స్టేలు తెచ్చుకుని ఉన్నారు. కాబట్టి ఆయన మీదా ఎంక్వైయిరీ జరిగి ఆయనకు ఇక స్మాష్ అయిపోయి నట్లేనని వైసీపీ శ్రేణులు ఉత్సాహపడుతున్నాయి. ఓహ్.. ఎమ్మెల్యేలు, ఎంపిలు, వారి రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఇదే చర్చ. దేశం మొత్తం మీద లక్షలాది మందికి ఇది ఒ పెద్ద సందేహం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు అవుతాయా? అవ్వవా? అయితే నిజంగా వేగంగా విచారణ జరుగుతుందా? జరగదా? ఒక వేళ విచారణ జరిగినా శిక్ష అమలు అవుతుందా? అవ్వదా? శిక్ష ఖరారు చేసిన తరువాత పై కోర్టుకు వెళితే.. అక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులే ఏర్పాటు చేస్తారా..? లేదా సుప్రీం కోర్టులో తాత్సారం జరుగుతుందా? అనేదే ఇక్కడ వంద మిలియన్ల ప్రశ్న. ఈ ప్రశ్నలు అన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న నేరారోపణలు, అవినీతి కేసులు ఉన్న రాజకీయ నాయకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశాన్ని ఒక సారి చూద్దాం.
సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలపై కేసుల సత్వర విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివిధ హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. వాటిని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై 4859 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 132, తెలంగాణలో 143 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏపిలో పెండింగ్లో ఉన్న కేసుల్లో 10 సెషన్స్ కోర్టులో ఉండగా మిగిలిన 122 కేసులు మెజిస్ట్రేట్ స్థాయి కోర్టుల్లో ఉన్నాయి. కేసుల సత్వర విచారణకు ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపి హైకోర్టు తమ యాక్షన్ ప్లాన్లో తెలిపింది. సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టలను కడప, విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణపై ఏపి తన సందేహాన్ని వెలిబుచ్చి స్పష్టత కోరింది. ఈ కేసుల విచారణను ప్రాధాన్యత క్రమంలో విచారించాలా, లేక సాధారణ విచారణ గా నిర్వహించాలా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరింది.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో హైదరాబాద్ ప్రత్యేక కోర్టుల 119, మరో 25 కేసులు సీబీఐ సహా ఇతర కోర్టుల్లో ఉన్నట్లు సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదకలో పేర్కొన్నది. మహబూబ్నగర్, కరీంనగర్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసులను 9 నెలల్లో ముంగిచే దశలో ఉన్నట్లు తెలిపింది. మరో 11 కేసుల్లో సీబీఐ, ఐదు కేసుల్లో ఈడీ చార్జిషీట్లు ఫైల్ చేసిందని తెలియజేసింది. కేసుల విచారణ, పురోగతికై ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకొని ఇతర హైకోర్టులు వెబ్ సైట్ రూపొందించేలా చూడాలని సుప్రీం కోర్టును అమికస్ క్యూరీ కోరారు. కేసుల పురోగతిపై నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. ఈడీ, సీబీఐ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతిపై నివేదిక అందించాలని కోరుతూ ఎంపి, ఎమ్మెల్యేల కేసుల విచారణతో పాటు దర్యాప్తునూ హైకోర్టు పర్యవేక్షించాలని సూచించారు.
సాక్షుల సంరక్షణ చట్టం 2018ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లన నియమించాలని కోరారు. కేసుల సత్వర విచారణకు వీరంతా సహకరించాలన్నారు అమికస్ క్యూరీ. సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టుల భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అమికస్ క్యూరీ సూచించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?