5 Paise biryani: సాధారణంగా ఏదైనా షాపులను ప్రారంభించే సమయంలో కస్టమర్లలను ఆకర్షించేందుకు నిర్వహకులు ఆకర్షనీయమైన స్కీమ్ లను పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి నూతనంగా బిర్యానీ సెంటర్ ప్రారంభిస్తూ కస్టమర్ లను ఆకర్షించేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. ప్రస్తుతం చెలమణిలోని అయిదు రూపాయల నాణెం తీసుకువస్తారో వారికి ఉచితంగా బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం అయిదు రూపాయల నాణెంలు అందుబాటులో లేకపోవడం, చెలామణిలో కూడా లేకపోవడంతో ఎక్కువ మంది రారులే అనుకున్నాడోమో ఏమో ఈ ఆఫర్ ప్రకటించారు.
అయితే బిర్యానీ ప్రియులు ఇళ్లల్లో ఎప్పుడో దాచిన అయిదు రూపాయల నాణేలను వెతికి మరీ దొరకబుచ్చుకుని బిర్యాని సెంటర్ వద్ద బారులు తీరారు. పది మంది కాదు ఇరవై మంది కాదు ఏకంగా మూడు వందల మందికి పైగా క్యూకట్టారు. ఇందులో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతికదూరం నిబంధనలను లెక్కచేయకుండా ఒకరిపై ఒకరు తోసుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో ఖంగుతిన్న షాపు యజమాని షట్టర్ మూసి అక్కడ నుండి చెక్కేశాడు. ప్రజలు పెద్ద ఎత్తున బిర్యానీ సెంటర్ వద్ద గుమిగూడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. బిర్యానీ సెంటర్ నిర్వహకుడు ఫ్రీ ఆఫర్ ఇవ్వడంతో అయిదు పైసల కోసం ఇల్లంతా వెతికి కష్టపడి తీసుకువస్తే చివరకు దుకాణం యజమాని మూసేసి వెళ్లిపోయాడంటూ కొందరు బిర్యానీ ప్రియులు వాపోయారు.