ఢిల్లీ: వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తప్పనిసరిగా 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నాయి.
ఈవిఎంల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన 21 పార్టీలు గతంలో బ్యాలెట్ పద్దతిలో వోటింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ను కోరాయి. అయితే ఎన్నికల కమిషన్ అందుకు నిరాకరించటంతో 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు అయినా లెక్కించాలని డిమాండ్ చేశాయి. దీనికి కూడా ఎన్నికల కమిషన్ సుముఖత వ్యక్తం చేయకపోవటంతో ఈ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఇరువైపు వాదనలు విని.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వివిప్యాట్ స్లిప్పులు, లోక్సభ పరిధిలో మొత్తం 35 వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. దీనిపై ఈ పార్టీలు నేడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.