గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు భవన శిధిలాలలో చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున ఐదు గంటలకు జరిగింది.
అగ్నిమాపక శాఖ అధికారులు, ఘజియాబాద్, ద్వారకలకు చెందిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మూడు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. శిధిలాలలో చిక్కుకొని ఉన్న మరో ఇద్దరి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.