ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాలు రెండొవసారి ప్రారంభం అయినా వేళ, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా అసెంబ్లీ లో ఈ బిల్ ను ప్రవేశపెట్టారు. 75 శాతం ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అనేది ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
హరియాణాలోని ప్రైవేటు కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, ఇతర సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో ఈ కోటా ప్రకారమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. దీంతో రూ.50వేలు కంటే తక్కువ వేతనం కలిగిన ఉద్యోగాల్లో మూడో వంతు స్థానికులకే కల్పించనున్నారు. అయితే, ఏదైనా ఒక కంపెనీకి అవసరమైన అభ్యర్థులు స్థానికంగా అందుబాటులో లేకపోతే సంబంధిత కంపెనీకి దీన్నుంచి మినహాయింపు కల్పిస్తూ నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచింది. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్లు ఇవ్వడం చౌతాలా యొక్క జన్నాయక్ జంతా పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక వాగ్దానం. ఎన్నికలలో గెలిచిన దుష్యంత్ , బిజెపి తో పోతు పెట్టుకొని డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. సభ బిల్లును ఆమోదించిన తరువాత, లక్షలాది మంది యువతకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిందని చౌతాలా చెప్పారు. అయితే ఈ బిల్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం ఇది చట్ట రూపం దాల్చనుంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానికులకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గత ఏడాది 75 శాతం ప్రైవేట్ ఉద్యోగాలని రాష్ట్ర స్థానికులకు కేటాయించే బిల్ ను ఆమోదించగా, తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా 50 శాతం తో బిల్ ను ఆమోదించారు.