Bihar: భారతీయులు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి రుజువైంది.18ఏళ్ల పాటు భారత్ బద్ధ విరోధి పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బీహారీలు బద్దలు చేసేశారు.హోం మంత్రి అమిత్ షా సమక్షంలో చోటు చేసుకున్న ఈ అద్భుతాన్ని సాక్షాత్తు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా వీక్షించి వివరాలు నమోదు చేయటం విశేషం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జెండాల ప్రదర్శన లో నయా రికార్డ్!
ఇంతకీ భారత్ ఏ విషయంలో ఈ రికార్డు సాధించిందో తెలుసుకుని తీరాలి.దేశభక్తిని చాటుకుంటూ ఏక కాలంలో డెబ్బై ఎనిమిది వేల మంది మువ్వన్నెల జాతీయ జెండాను చేబూని ప్రదర్శన గా ముందుకు సాగి చూపరులను ముగ్ధులను చేశారు.బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా బీహార్లో 1857 సిపాయిల తిరుగుబాటులో అమరుడైన వీర్ కున్వార్ సింగ్ కి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ జెండాల ప్రదర్శన ఏర్పాటు అయింది.దీన్ని ప్రతిష్టాత్మకంగా బిజెపి నిర్వహించింది.
Bihar: ఐదు కిలోమీటర్ల పొడవున్న ర్యాలీ!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొననున్న నేపధ్యం లో జాతీయ జెండాల ప్రదర్శన నభూతో నభవిష్యత్ లా జరిగేలా బీజేపీ ముందస్తు ఏర్పాట్లు చేసింది.ఏకంగా డెబ్బై ఎనిమిది వేల మంది జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రదర్శన నిర్వహించగా అది ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించింది.ఈ కార్యక్రమం గురించి ముందే తెలుసుకున్న గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అక్కడికి చేరుకొని జెండా ధరించిన ప్రతి ఒక్కరిని లెక్కించారు.78వేల మంది జెండాల ప్రదర్శనలో పాల్గొన్నట్లు గిన్నిస్ వరల్డ్ బుక్ ప్రతినిధులు ధ్రువీకరించారు.
పాకిస్థాన్ రికార్డ్ బద్దలు బద్దలు!
నిజానికి జెండాల ప్రదర్శన లో ఇప్పటివరకు పాకిస్థాన్ దే రికార్డుగా ఉండేది.2004 వ సంవత్సరం లో లాహోర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏకకాలంలో యాభై ఆరు వేల మంది పాకిస్తాన్ జెండాలతో ప్రదర్శన నిర్వహించగా అది ప్రపంచ రికార్డుల కెక్కింది.ఇప్పుడు భారత్ 78వేల మందితో అదే తరహా ప్రదర్శన నిర్వహించి పాకిస్థాన్ రికార్డును చెరిపేసింది.ఇది భారతీయులందరికీ గర్వకారణమని బిజెపి నేతలు నొక్కి వక్కాణిస్తున్నారు.