Suicide : నవమాసాలు మోసి కని జన్మనిచ్చిన తల్లి స్వయానా తన కూతురి పాలిట మృత్యువు అయింది. ఎంతో అపురూపంగా పెరగాల్సిన ఆ బిడ్డ ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేవలం భార్య భర్తల మధ్య గొడవ కారణంగా 8 నెలల తన కూతురితో పాటు రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. తన భర్తతో గొడవ జరగడం వల్ల ఎంతో మనస్తాపానికి గురైన మహిళ తనకున్న ఎనిమిది నెలల పాపంఎత్తుకొని రెండంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
బీహార్కు చెందిన భీమల్ కుమార్, ఆర్తి భార్య భార్తలు. వీరికి 8 నెలల పాప ఉంది.కొన్ని సంవత్సరాల క్రితం జీవనాధారం కోసం హైదరాబాద్ వచ్చిన ఈ దంపతులు ఇక్కడే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. కుటుంబ కారణాల వల్ల కొద్ది రోజుల క్రితం నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి కూడా వీరిరువురి మధ్య గొడవలు తలెత్తాయి. ఈక్రమంలోనే మాటా మాటా పెరగడంతో భీమల్ కుమార్ ఆర్తి పై చేయి చేసుకున్నాడు.
ఈ విధంగా తన భర్త తనపై చేయి చేసుకోవడంతో ఎంతో మనస్తాపానికి గురైన ఆర్తి తాను నివసిస్తున్న రెండు అంతస్తుల భవనం పై నుంచి తన 8 నెలల బిడ్డతో సహా కిందకు దూకింది. ఈ క్రమంలోనే ఈ ఘటన చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. రెండంతస్తుల పైన నుంచి దూకడం వల్ల అధిక గాయాలు కావడంతో ఆర్తి చికిత్సపొందుతూ మరణించింది. ఇక చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని డాక్టర్లు తెలియజేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆర్తి భర్త భీమల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?