ఉత్తరప్రదేశ్ లో వికాస్ దుబే అనే ఒక పెద్ద రౌడీషీటర్ మరియు ఎంతో నేర చరిత్ర కలిగిన నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందడం గమనార్హం. వికాశ్ పై ఇప్పటికే 60 క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. ఇకపోతే చనిపోతిన వారిలో ఒక డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు.
శుక్రవారం అతనిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వారిపై ఎన్ కౌంటర్ చేయలసి వచ్చింది. బికారు అనే ఒక గ్రామంలో వారు రైడ్ చేయగా జూలై 2,3 వ తేదీలలో దుబే అక్కడ ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఇక పోలీసులు అతని స్థావరాన్ని ముట్టడించి ఇంటి పైకప్పు నుండి అతని కదలికలను పరిశీలిస్తుండగా వారిపై దుబే మరియు అతని అనుచరులు బుల్లెట్ల వర్షం కురిపించారు.
అక్కడికక్కడే డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా తో సహా ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు చనిపోయారు. ఇక దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసు వారి చావులకు సంతాపం తెలిపి అందుకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు వారిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా చనిపోయిన ఎనిమిది మంది పోలీసులతో పాటు నలుగురికి తీవ్ర గాయాల పాలవగా వారు చికిత్స పొందుతున్నారు.