కరోనా విజృంభిస్తున్న విలయం తీవ్రంగా ఉంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు పోయాయి. చిన్న పిల్లలు, వృద్దులులో దీని ప్రభావం బాగా ఉండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అవసరం ఉన్న కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. దీర్ఘవ్యాధులతో బాధపడేవారు కూడా హాస్పిటల్ కి వెళ్లలేకపోతున్నారు. కొన్ని చోట్ల డాక్టర్స్ సైతం వైద్యం చేయడానికి వెనకాడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా మహారాష్ట్రకు చెందిన 87 ఏళ్ల ఓ డాక్టర్ మునుపటిలా పేదలకు వైద్యసేవలు చేస్తున్నాడు. అందుకేనేమో పెద్ద వాళ్ళు వైద్యో నారాయణో హరి అని ఇలాంటి వారిని చూసి అన్నారనిపిస్తుంది.
మహారాష్ట్రకు చెందిన రామచంద్ర దండేకర్ గత 60 సంవత్సరాలుగా ప్రతినిత్యం 10 కిలో మీటర్లు సైకిల్ పై మూలం, పొమ్భర్ణ, బల్లార్షహ్ తాలూకా లోని వెళుతూ ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. వారికీ దేవుడిగా మారాడు. అందరు ఆయన్ని గౌరవంగా “డాక్టర్ సాహెబ్ ముల్ వాల్” అని పిస్తారు.మరి దూరం అయితే సైకిల్ పై వెళ్లి వారి బాగోగులు చూసి వస్తుంటారు.
1957 -58 లో రామచంద్ర దండేకర్ నాగపూర్ కాలేజీ ఆఫ్ హోమియోపతి లో డిప్లొమా పూర్తి చేశారు. తరవాత చందాపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్ గా పనిచేసారు. అప్పుడే ఆయనకి ప్రజలకి సేవ చేయాలనే కోరిక ఉంది. ఓ పక్క లెక్చరర్ గా పనిచేస్తూనే మరో వైపు దగరలోని ఏడూ గ్రామాల ప్రజలకు వైద్యం చేసేవారు. అప్పటినుంచి ఇప్పటి దాక నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. వారితో ప్రేమగా మాట్లాడుతూ, ధైర్యంగా ఉండమని చెప్తారట. కరోనా విషయమై కాకుండా వయోభారంతో ఇంతకు ముందులా ఆయన వెళ్ళలేకపోతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎవరైనా బాగోలేదని ఫోన్ చేస్తే వారికీ అవసరమైన మందులను చెప్పి సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళమని చెప్తున్నారు. ఆయన పెద్ద కొడుకు జయంత్ తండ్రికి కొంత సాయం చేస్తున్నాడు.వారంలో ఏ ప్రాంతాలకు వెళ్లాలో నిర్ణయించి ఆయనే తీసుకెళ్తానారు.అయితే తాను ఉన్నంత వరకు వైద్య వృత్తిని వదలబోనని, ప్రజలకు సేవను అందిస్తానని రామచంద్ర చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?