కార్వార్, జనవరి 21: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కార్వార్ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు.
కూర్మగూడ సమీపంలో జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.
మత్స్యకారులు, కోస్ట్గార్డు సిబ్బంది గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మృతదేహాలను వెలికి తీసినట్లు నేవీ సిబ్బంది తెలిపారు.
https://youtu.be/xuCDes9Meo4