బ్రెజిల్లో హారిజాంబే ప్రాంతంలో శనివారం ఆనకట్ట కూలి పోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 300మంది గల్లంతు అయ్యారు. బ్రెజిల్లోని మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్ధాలను వేసేందుకు ఈ డ్యామ్ నిర్మించింది. ఒక్కసారిగా ఈ డ్యామ్ కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ఒక భవన సముదాయాన్ని ముంచెత్తింది. ఈ భవనంలో 300మందికి పైగా గని కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా బురదలో గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
previous post
next post