భారత్ మార్కెట్ లోని ద్విచక్రవాహనం విభాగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడం కోసం అన్ని కంపెనీలు కృషి చేస్తున్నాయి.. మహామారి కరోనా కారణంగా ఫ్లాట్ అమ్మకాలు జరిగాయి.. కొన్ని కంపనీలకు నష్టం కూడా వచ్చింది.. అయితే రానున్న ఆరు నెలల్లో లాభాల బాట కోసం ముందుగానే కంపెనీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాన్నాయి..! బ్రిటిష్ లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ మోటార్ సైకిల్స్ ఇండియా కొత్త సంవత్సరం కోసం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది..! జనవరి 2020 నుండి జూన్ వరకు సరికొత్త మోడల్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది..! రానున్న ఆరు నెలల్లో భారత్ మార్కెట్లో 9 కొత్త బైక్ లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తుంది..! ఆ తొమిది మోడల్స్ వివరాలు ఇలా..
కరోనా కారణంగా ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రైయంప్ ప్లాట్ అమ్మకాలను చవిచూసింది.ఈ నేపథ్యంలో జూన్ 2020 నాటికి 20-25% వృద్ధి సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. భారత మార్కెట్ కోసం ట్రైయంప్ ప్లాన్ చేస్తున్న కొత్త మోడల్ లో కొన్ని స్పెషల్ మోడల్ కూడా ఉన్నాయి. మోడరన్ క్లాసిక్, క్రేన్ టాపింగ్, రాకెట్ 3 జిటి వంటి మోడల్ కూడా ఉన్నాయి. తమ ఎంట్రీ లెవల్ మోడల్ ట్రైయంప్ ట్రైడెంట్ 660 మొదటిగా నిలుస్తుంది. వచ్చే ఏడాది విడుదలయ్యే కొత్త మోడల్ లో సరికొత్త 2021 టైగర్ 850 స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కూడా ఒకటి. కంపెనీ ఇటీవలే ఈ మోడల్లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త టైగర్ 850 స్పోర్ట్స్ బ్రాండ్ యొక్క కొత్త మోడల్ రానుంది. ఈ మోటార్ సైకిల్ కూడా రోడ్డు ఓరియెంటెడ్ అడ్వెంచర్ టూరర్ గా ఉంటుంది. ఇది కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన టైగర్ 900 మోడల్ కు బేస్-లెవెల్ వేరియంట్ గా అందుబాటులోకి రానుంది. తాజాగా పిటిఐ నుండి వచ్చిన నివేదికల ప్రకారం భారత్ మార్కెట్ లోని ద్విచక్రవాహనం స్థానంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ట్రైయంప్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షూబ్ ఫారూక్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నుండి జూన్ వరకు తొమ్మిది కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్స్, కొన్ని రకాల మోడల్స్ లో రీఫ్రెష్డ్ వెర్షన్ లను కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఆరు నెలల్లో తమ కొత్త ఉత్పత్తులతో బిజీగా ఉండనున్నట్లు వివరించారు.