కీర్తి సురేష్ గురించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరూ మహానటి సినిమా కి ముందు ఆ తర్వాత అని చెప్పుకుంటున్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన క్రేజ్ ని విపరీతంగా పెంచుకుంటుంది. ఇప్పటికే కీర్తి సురేష్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఒక భారీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ కోసం చూస్తుంది కీర్తి. ఇప్పటికే ఒక సినిమా చేస్తుందన్న వార్తలు వస్తున్నప్పటికి అందులో పక్కా క్లారిటీ లేదు.
ఇక త్వరలో కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా త్వరలో దసరా పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతుందని సమాచారం. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయో సర్కారు వారి పాట లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ మద్య ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సౌత్ లో కీర్తి కి మరో భారీ ఆఫర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.
ప్రభాస్ హీరోగా నటించనున్న ఆదిపురుష్ 3డి సినిమా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో పెద్ద సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించబోతున్నారు. ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆదిపురుష్ 3డి లో సీత పాత్ర కి మేకర్స్ ఎవరిని ఎంచుకోబోతున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖంగా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న కీర్తి సురేష్, కియరా అద్వాణీ సీత పాత్రలో నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయీన్ గా వరస ఆఫర్లతో ఊపిరాడనంత బిజీగా ఉంది కియారా అద్వాని. అక్షయ్ కుమార్ సరసన భారీ ప్రాజెక్ట్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది కియారా. ప్రస్తుతం టాలీవుడ్ లో నటించడానికి కూడా కుదరనంత బిజీగా ఉన్న కియారా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో గొప్ప అవకాశం దక్కించుకుందని సమాచారం. ఈ విషయం కియారానే హింట్ ఇచ్చింది. కాని ఇది అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.
కాగా ప్రభాస్ పక్కన సీతగా కీర్తి సురేష్ అన్న న్యూస్ చాలామందికి కొత్తగా అనిపించింది. కాని ఇప్పుడు కీర్తి సురేష్ కంటే కియారా అయితేనే ప్రాజెక్ట్ కి బాగా కలిసి వస్తుందన్న ఉద్దేశ్యంతో మేకర్స్ ఎక్కువగా కియారా వైపే మొగ్గు చూపుతున్నారట. కీర్తి సురేష్ ఒక్క బాలీవుడ్ సినిమా చేయకపోవడంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయిందన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొత్తానికి ఈ కారణం తో మహానటి ని బాధ పెట్టినట్టు భావిస్తున్నారు కొందరు కీర్తి ఫ్యాన్స్. చూడాలి మరి అధికారక ప్రకటన వచ్చే వరకు ఏం జరగనుందో.