మరాఠిలో ‘లోకమాన్య : ఏక్ యుగ పురుష్’ సినిమాని తెరకెక్కించి ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకున్న దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ‘తానాజీ’ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లతో ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా కనిపించబోతుండగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపంచబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఒక్క సీత పాత్ర నే కాదు మరో ప్రధాన పాత్రలు అయిన లక్ష్మణ, హనుమ రోల్స్ కు సంబంధించి అప్డేట్స్ కూడా వచ్చే నెల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ముందుగా ఈ సినిమాలో సీత గా నటించబోతున్న హీరోయిన్ ని రివీల్ చేయనున్నారని సమాచారం. అయితే అందుకోసం ప్రభాస్ బర్త్ డే అయిన ఈ నెల 23 వరకు ఆగాలా లేక ఈలోపే రివీల్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది.