యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’. మొదటి సారి ఈ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఎంటరవబోతున్నాడు ప్రభాస్. రామాయణం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. అలాగే ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారకంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల తో పాటు ప్రేక్షకుల్లో మిగతా ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా ‘సీత’ గా నటించబోయే హీరోయిన్ ఎవరన్న విషయంలో ఇప్పటికే చాలా మంది టాప్ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సీత పాత్రలో ‘మహానటి’ కీర్తి సురేష్ నటించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కియారా అద్వాణీ పేరు వినిపించింది.
ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ప్రభాస్ కి జంటగా సీత పాత్ర కోసం మేకర్స్ సంప్రదించిన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ‘ఆదిపురుష్’ చిత్ర బృందం స్పందించారు. ‘ఆదిపురుష్’ సినిమాలో నటించే హీరోయిన్ గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని చిత్ర యూనిట్ ఖండించారు. ‘ఆదిపురుష్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు’ అని స్పష్టం చేశారు.
ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. 2021 ప్రారంభంలో ‘ఆదిపురుష్’ ని సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 3డీ ఫార్మాట్ లో హిందీ, తెలుగు భాషల్లో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!