ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ గా వరస ఆఫర్లతో బిజీగా ఉంది కియారా అద్వాని. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. అయితే ఈ మధ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కియారాకి అద్భుతమైన అవకాశం అందుకుందని అంటున్నారు.
ప్రభాస్ హీరోగా నటించనున్న ఆదిపురుష్ 3డి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించబోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నదానిపై సోషల్ -మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కియరా అద్వాణీ సీతగా నటిస్తుందన్న ప్రచారం మొదలైంది.
అయితే తాజా ఇదే ప్రశ్న ఒక అభిమాని కియారాను అడిగాడట. మరిన్ని సౌత్ చిత్రాలలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా! అని ఆ అభిమాని అనగానే.. దానికి సమాధానమిస్తూ “మీరు త్వరలో అందుకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారన్నట్టుగా ” కియరా తెలిపిందట. వాస్తవంగా ఆదిపురుష్ లో సీత గా కీర్తి సురేష్ కనిపించనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సీత గా ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.
కాగా తాజాగా కియరా చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఓం రౌత్ కి టచ్ లోనే ఉందని అర్థమవుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను బాగా క్రేజ్ ఉన్న కియరాఆదిపురుష్ కి కలిసొచ్చే హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఇంతకు ముందు ‘చంద్రముఖి 2; లో కియరా నటిస్తుందని ముందు ప్రచారం అయినప్పటికి ఇందులో వాస్తవం లేదని తర్వాత వెల్లడైంది. ఇప్పుడు ఆదిపురుష్ విషయం లో ఏం జరుగుతుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?