ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ .. భారీ కాన్వాయిస్ తో రూపొందుతున్న ఈ సినిమా మీద అన్ని చిత్ర పరిశ్రమలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. అందుకు కారణం ఆర్ ఆర్ ఆర్ కి ముందు రాజమౌళి తీసిన బాహుబలి ఫ్రాంఛైజీనే. ఈ సినిమా నెలకొల్పిన రికార్డుల మూలంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
అయితే ఎప్పుడైతే కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి కొంతమందిలో ఈ సినిమా మీద అంచనాలు .. అభిప్రాయాలు మారుతూ .. తగ్గుతూ వచ్చాయి. కాగా మధ్యలో భీం ఫర్ రామరాజు టీజర్ వచ్చి మళ్ళీ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. రాజమౌళి సత్తా గురించి మరోసారి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. కాని లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడగిస్తూ రావడంతో పెద్ద గ్యాప్ లేకుండా వస్తుందనుకున్న రామరాజు ఫర్ భీం కి నెలల గ్యాప్ వచ్చేసింది.
కరోనా కొట్టిన దెబ్బతో అన్ని సినిమాల లెక్కలు, అంచనాలు తారుమారయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల మీద కరోనా ప్రభావం భాగా పడింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ దాదాపు 400 కోట్లు అని అంటున్నారు. మాములుగా అయితే ఈ బడ్జెట్ రికవరవడం చాలా చిన్న విషయం. ఎందుకంటే దర్శక ధీరుడు రూపొందిస్తున్న సినిమా.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. అజయ్ దేవగన్.. శ్రియ శరణ్.. బ్రిటన్ మోడల్ ఓలియా .. లాంటి భారీ తారాగణం.
అందుకే ఈ సినిమాకి బడ్జెట్ కంటే నాలుగు రెట్లు వసూళ్ళు సాధిస్తుందన్న నమ్మకం .. ధీమా అందరిలోను ఉంది. కాని కరోనా విసిరిన పంజాతో సీన్స్ రివర్స్ అయి టాక్ వేరేలా మారింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టిన రాజమౌళి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామరాజు ఫర్ భీం టీజర్ ని వదిలి మళ్ళీ సినిమా మీద అంచనాలు పెంచేశాడు.
అంతేకాదు తాజాగా దీపావళి పండగ సందర్భంగా రాజమౌళి, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చి ఆ అంచనాలని ఇంకాస్త పెంచాడు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ మ్యానియా మొదలైనట్టే. ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరు ఊహించని మిరాకిల్ జరగడం ఖాయమనిపిస్తోంది.