ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష పడింది అన్న చందంగా ఉంది వరంగల్ లో జరిగిన ఘటన. తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోలేదని అటు పుట్టింటివారికి ఇటు అత్తారింటి వారికి పెద్ద శిక్ష వేసిందో నవ వధువు. ఈ ఘటన వరంగల్ జిల్లా నారాయణగిరి లో జరిగింది. ఇటీవల నారాయణగిరి లోని రవళికి వరంగల్ అర్బన్ జిల్లాలోని మాణిక్యపూర్ గ్రామానికి చెందిన రాజుతో పదహారు రోజుల క్రితం వివాహం జరిగింది.
పెళ్లికి ముంద రవళి ఇంకొకరిని ప్రేమించిందట. రవళి ప్రేమకు ఆమె తల్లిదండ్రులు నో చెప్పి తాము చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చెయ్యడంతో ఆమె ఇంకేమి చేయలేక మౌనంగా ఉండిపోవడంతో ఆమెకు ఇష్టమే అనుకుని ఆమె తల్లితండ్రులు పెళ్లి చేశారట. రెండు వారాల క్రితం వీరి వివాహం జరిగింది. తన ప్రేమని కాదని తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంకొకరితో పెళ్లి చెయ్యడంతో ఆమె తట్టుకోలేక అత్తగారింటికి వెళ్లిన కొద్ది రోజులకే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.
అయితే ఆ యువతి తన చావునకు ఎవరూ కారణం కాదని మరియు తన భర్తకు క్షమాపణలు కోరుతూ ఒక సూసైడ్ నోట్ రాసారు. ఆ సూసైడ్ నోట్ లో తన తల్లిని ఉద్దేశించి ‘‘నీకు అన్ని ముందే తెలుసు. కులం, మతం అంటూ నా ప్రేమను కాదన్నావ్ “ అని పేర్కొన్నారు. ఇలా సూసైడ్ నోట్ రాసి అత్తగారింట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసినవారు తను చేసిన తప్పుకి ఏమి తెలియని అతని భర్త మరియు అత్తవారింటికి శిక్ష వేయడం ఎంతమాత్రం సరికాదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు.