భారత ఆచారాలు, పద్ధతులు పక్కన పెట్టి రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో వివాహం చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటుచేసుకుంది. పెళ్లి పీటలు దిగిన తర్వాత భర్తకు ఈ విషయాన్ని మెల్లిగా చెప్పింది భార్య. ఈ విషయం పెళ్ళి సమయంలో వరుడికి తెలియదు మరియు తరువాత చెప్పినందుకు పెళ్ళికొడుకు పెద్ద రాద్ధాంతం చేసాడు. తమ విశ్వాసాలను పెళ్లి కూతురు దెబ్బతీసిందని, పెద్ద నేరం చేసిందని చాలా గొడవ చేసాడు. అతడు అంతటితో ఊరుకోకుండా ప్రస్తుతం ఏకంగా విడాకులు కోరుతున్నాడు.
వడోదరకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి గత నెలలో వివాహం జరిగింది. ఆమె ఒ టీచర్. ఆమె పెళ్లి రోజు ఆమెకు నెలసరి రావడంతో ఎం చెయ్యలేక పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి తరువాత ఒక ప్రత్యేక పూజ కోసం ఓ దేవాలయంలోకి వెళ్లే ముందు ఆ వధువు తాను పీరియడ్స్ లో ఉన్నానని తన అత్తగారికి తెలిపింది.
ఇది విన్న వరుడి తల్లి కోపంతో ఆమెను అనరాని మాటలు అన్నది. అటువంటి సమయంలో పెళ్లి చేసుకొని తమ మత విశ్వాసాలకు భంగం కలిగిందని, పెళ్లి తంతుని అపవిత్రం చేశావని మండిపడింది. అత్తగారితో పాటు భర్త కూడా ఈ భార్య నాకొద్దు అంటూ విడాకులకు దరఖాస్తు చేశాడు.
దీనికి ఆ యువతి స్పందిస్తూ ఇదో పెద్ద విషయం కాదని దీనికోసం విడాకులు కోరడం సమంజసం కాదంటూ ప్రాధేయపడుతుంది. విడాకులు అడగడానికి వెనుక కారణం వేరే ఉందని టీచర్ గా పనిచేస్తున్న తాను అప్పులలో ఉన్న తన కుటుంబానికి ప్రతి నెల రూ.5వేలు పంపడమే ఈ వివాదానికి కారణమని ఆమె అంటోంది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది.