(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కర్నూలు జిల్లా బనగానపల్లిలో భారీ పేలుడు తీవ్ర కలకలాన్ని సృష్టించింది. భారీగా పేలుడు శబ్ధంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దానికి పలువురి ఇళ్లలోని అద్దాలు, ఎలక్ట్రికల్ వస్తువులు పగిలిపోయాయి.
బనగానపల్లిలోని ఈద్గానగర్, నర్శింహరెడ్డి కాలనీ, ఆర్ టీ సీ బస్టాండ్ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఒక్క సారిగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి దీనిపైనే చర్చించుకున్నారు. ఇంత భారీ పేలుడు శబ్దం ఇంత వరకూ వినలేదని అంటున్నారు. రవ్వలకొండ మైనింగ్ పేలుళ్లు అని స్థానికులు భావిస్తున్నారు. ఈ భారీ పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.