టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎప్పుడెప్పుడు మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూసిన అభిమానుల కలను నెరవేరుస్తూ ఖైదీ నెం 150 తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకుని తనలో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్. ఆ తర్వాత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇలా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్ కోసం కొత్త కథలు తయారవుతున్నాయి. దర్శకులు, రచయితలు అన్నయ్య తో ఒక్క సినిమా అయినా చేయాలనే ఉత్సాహంతో కథలు సిద్దం చేసుకుంటున్నారు.
ఇప్పటికే చిరు కి కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఒక ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే కథను రాశాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే చిరంజీవి ఆచార్యతో పాటు మెహర్ రమేష్ సినిమాని చేస్తున్నారు. వీటితో పాటుగా మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయినా ‘లూసిఫర్’ అనే చిత్రంలో కూడా చిరు నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరుస సినిమాలతో బిజిగా ఉన్న చిరు తన కథను కూడా ఓకే చేస్తాడని ఆశ పడుతున్నాడట దర్శకుడు వెంకీ కుడుముల.
ఆ నమ్మకంతోనే త్వరలోనే మెగాస్టార్ కి కథ చెప్పనున్నాడట. మరి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడిగా ఛలో, భీష్మ చిత్రాల విజయాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీకి చిరు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా చిరు అభిమానులు మాత్రం మెగాస్టార్ కోసం దర్శకుల క్యూ పెరిగిపోతుండటంతో చాలా హ్యపిగా ఫీలవుతున్నారని.. పూర్తిగా కరోనా కంట్రోల్ లోకి వస్తే వరసగా ఏడాదికి 3 సినిమాలైనా మెగాస్టార్ నుంచి వస్తాయని చెపుకుంటున్నారట.