ముందే.. మన దేశంలో రోజులో ఒక్కపూట భోజనం చేసి మిగతా పూటల్లో పస్తులుండేవారి సంఖ్య ఎక్కువ. ఈ రెక్కడితే కానీ డొక్కాడని ప్రజలను కరోనా మరింత బాధ పెడుతోంది. కరోనా వల్ల ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. వారికి మళ్లీ ఏం పని చేయాలో తెలియని పరిస్థితి. కడుపునింపుకోవడానికి ఏం పనైనా చేయడానికి సిద్ధమైనా కానీ పనులేమీ దొరకడంలేదు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం 2020 చివరి నాటికి అదనంగా 130 మిలియన్ల మంది ఆహార అభద్రతను ఎదుర్కోంటారని అంచనా వేసింది.
అయితే.. ఈ కరోనా కష్టకాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఫ్రీగా పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు వారికి చేతనైన సాయం చేస్తున్నారు. మరికొందరూ తక్కువ ధరకే సరకులను అందిస్తూ.. సేవగుణాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటిదే.. ఢిల్లీలో ఒక ఫుడ్ స్టాల్ చేస్తోంది. ఒక్కరూపాయికే పూర్తి థాలిని అందిస్తూ.. ఎంతో మంది ఆకలిని తీరుస్తోంది. ఈ స్టాల్ నిర్వహకులు చేస్తున్న పనికి పలువురు ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
వివరాల్లోకి పోతే.. ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలో ఉన్న శివ మందిరం సమీపంలో శ్యామ్ రసోయి అనే ఫుడ్ స్టాల్ ఒకటి ఉంది. కరోనా వల్ల ఎంతో మంది ఆకలితో అలుమటిస్తున్నారు, మన వంతుగా ఏదైనా వారికోసం చేయాలని నిర్వహకులు అనుకున్నారు. దీంతో సేవ చేయడం కోసం శ్యామ్ రసోయి యాజమాన్యం కేవలం ఒక్క రూపాయికే పూర్తి థాలిని అందించాలనుకుంది. అనుకున్నదే అదునుగా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఒక్క రూపాయి థాలి కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రారంభించింది. దాంతో ఎంతో మంది రోజూ ఆకలిని తీర్చుకోవడానికి ఈ స్టాల్ దగ్గరకు వస్తున్నారు. ఈ సందర్భంగా స్టాల్ యజమాని గోయల్ మాట్లాడారు. ప్రతి రోజు రెండు వేల మందికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపాడు. దుకాణం దగ్గరికి వచ్చే వారిలో 1000 మంది ఉంటే. మరో 1000 మందికి ఇ-రిక్షాల్లో వెళ్లి ఆహారాన్నిఅందిస్తున్నట్లు తెలిపారు.