Robbery: నగలు మరియు వజ్రాల చోరీ Robbery అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చే సినిమా హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన ధూమ్ సినిమా. ఆ సినిమాలో హీరో మరియు హీరోయిన్ లు పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకున్నారో చూసాం. అదే విధంగా తాజాగా కొందరు దొంగలు చాలా తెలివిగా ఏకంగా రూ. 130 కోట్ల విలువ చేసే వజ్రాల మరియు నగలును దొంగతనం చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఎలాగయితే ఏం పోలీసులు చాతచిక్యంతో ఆ దొంగలను పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే… ఈ ఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది. క్రిందటి సంవత్సరం జనవరిలో స్పెయిన్ లోని ఒక ఖరీదైన నగల దుకాణంలోకి ఎనిమిది మంది దొంగలు చొరబడ్డారు. మొదట వారంతా తాము వజ్రాలు కొనడానికి నగల దుకాణంకి వచ్చినట్టుగా అంతా నార్మల్ గా ఉంటూ ఆ దుకాణపు యజమానిని నమ్మించారు.
ఈ ఎనిమిది మంది దొంగలు అక్కడి సిబ్బందిని మాటలలో పెట్టి దాదాపుగా 15 మిలియన్ల యూరోలు విలువ చేసే నగలను చోరీ చేసారు. ఆ దొంగలు దోచుకున్న నగలలో ఎక్కువగా వజ్రాలు ఉండడంతో ఆ మొత్తం విలువ మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 132 కోట్ల పైమాటే. అయితే వీరు వెంటనే ఇక్కడ దోచుకున్న నగలు మరియు వజ్రాలతో స్పెయిన్ నుంచి ఫ్రాన్స్ కు పారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న స్పెయిన్ పోలీసులు ఫ్రాన్స్ దేశం పోలీసులతో కలిసి వజ్రాల దొంగల ముఠా కోసం వెతికారు. ఈ నేపథ్యంలో ఆ ఎనిమిది మంది దొంగలు ఫ్రాన్స్ లోని పారిస్ కు సమీపంలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేశారు.