Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ ఈ మూవీకీ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ కి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. దుబాయి లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెండవ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. షూటింగ్ మొదటి రెండు రోజులు జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్ర బృందలో కొందరికి పాజిటివ్ కేసులు నమోదవడంతో నిలిపివేశారు.
ఇటీవల మహేష్ బాబు సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ బ్యాంక్ సెట్టింగ్ లో ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న నటీ నటులు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక త్వరలోనే కీర్తి సురేష్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతుందని తాజా సమాచారం. కాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకూడదని ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఏడాది ప్రారంభం కావాల్సిన సర్కారు వారి పాట సినిమా బాగా ఆలస్యం అయింది.
Mahesh : మహేష్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలని దర్శకుడికి మహేష్ సూచించాడట. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఆఖరు వరకు సర్కారు వారి పాట షూటింగ్ ఫినిష్ చేయాలని మహేష్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చాడట. కాగా ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇది మహేష్ అభిమానులకే కాదు ప్రేక్షకులందరికి భారీ సర్ప్రైజ్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి మేకేర్స్ టీజర్ రిలీజ్ చేస్తారా లేక ఫస్ట్ లుక్ తో సరిపెడతారా.