Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో వైసిపి పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తూ చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యేలా రాజకీయం చేస్తున్న తరుణంలో చంద్రబాబు Chandrababu తెగ టెన్షన్ పడిపోతున్నారు. మీరు ఏకగ్రీవాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఏకగ్రీవ వాళ్లను అడ్డుకుంటామంటూ పేర్కొన్నారు.
అదేవిధంగా జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతులు బెదిరింపులు ప్రలోభాలు వంటి అరాచకాలకు వైసిపి నాయకులు పాల్పడి గత ఏడాది మార్చిలో జరిగి వాయిదాపడిన ఎన్నికల్లో 2374 స్థానాల్లో గెలిచారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ టైంలో ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ప్రదర్శించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని.. ప్రజల తీర్పు అనుగుణంగా కాదు అంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా పంచాయతీ రాజ్ మంత్రి తీరు సరిగా లేదని ఏకగ్రీవాలు కు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు.