Doctor: తమకు సేవ చేసిన వారిని ప్రజలు మర్చిపోరని రుజువు చేసే సంఘటన ఇది. పర్చూరు నియోజకవర్గం కారంచేడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ ఎన్ భాస్కర్రావు కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న నేపధ్యంలో ఆయన చికిత్సకు డబ్బు అవసరమని ఒక్క పిలుపు అందగానే మనిషన్న ప్రతివాడూ స్పందించాడు.
ఒక్క రోజులోనే ఆయనకు దాదాపు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందటం ఇందుకు నిదర్శనం. డాక్టర్ భాస్కర్రావు పోయినేడాది కరోనా సమయంలో కారంచేడు మండలం ప్రజానీకానికి విశేషసేవలందించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.ప్రజా సేవా దృక్పథం తప్ప వ్యాపార ధోరణి ఒంటబట్టని అరుదైన వైద్యుడు భాస్కర్రావు. ఆయన భార్య బొమ్మినేని భాగ్యలక్ష్మి కూడా డాక్టరే .గతంలో మండలంలోని స్వర్ణ వైద్య అరోగ్య కేంద్రంలో ఆమె పనిచేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.ఆ భార్యాభర్తలిద్దరికీ మండలంలో మంచి పేరు ఉంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ లో ఆయనే ఆ మహమ్మారికి చిక్కిపోయాడు.శ్వాస కోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమయ్యాయి .ఊపిరాడని పరిస్థితి కూడా ఆయనకు ఎదురైంది.దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా దాదాపు ముప్పై లక్షల రూపాయలు అవసరమని వైద్యులు చెప్పారు.డాక్టర్ భాస్కర్ రావు చికిత్సకు సైతం డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నారని సమాచారం కారంచేడు మండలానికి తెలియగానే ఆ గ్రామస్తులు అందరికంటే ముందుగా స్పందించారు.కారంచెడు గ్రామాభివృద్ధి కమిటీ వృద్ధాశ్రమం ఇతర దాతల సహకారంతో దగ్గుబాటి నాగేశ్వర్రావు రెండున్నర లక్షల రూపాయలు ఆ డాక్టర్ చికిత్స కి అందజేశారు.తదుపరి యూటీఎఫ్ కారంచేడు మండల కమిటీ డాక్టర్ భాస్కర్రావు దీనావస్థను వివరిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టగానే అద్భుత స్పందన లభించింది.బుధవారం ఐదు వందల రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరకు ఆ డాక్టర్ కు విరాళాలు వెళ్లాయి.ప్రముఖ వైద్యులు డాక్టర్ నాయుడమ్మ ఇరవై అయిదు వేల రూపాయలు సాయమందించారు.జీఎస్సార్ ఆంజనేయులు లక్షరూపాయలు పంపారు. ఇంకా ఎవరైనా సాయం చెయ్యాలి అనుకుంటే Dr Bommineni Bhagyalakshmi
State bank of India
SB a/c: 30692453244
IFSC: SBIN0001009 కి విరాళాలు పంపవచ్చు. తద్వారా ఒక మంచి డాక్టర్ ని మనమే కాపాడుకుందాం…