బాహుబలి ఫ్రాంఛైజీ తరవాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియన్ సినిమాలుగానే రూపొందుతుండటం విశేషం. అందుకు కారణం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సాధించడమే. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విదేశాలలో కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియీషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సంవత్సరం చివరలో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ తాజాగా మరో పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించాడు. “ఆది పురుష్” అన్న టైటిల్ తో ఈ సినిమా రూపొందబోతుంది. కాగా ఈ సినిమా ప్రకటించిన తర్వాత కొత్త టాక్ మొదలైంది.
వాస్తవంగా అయితే ప్రభాస్ కమిటయిన దాని బట్టి రాధేశ్యామ్ తరవాత నాగ అశ్విన్ సినిమా మొదలవ్వాలి. కానీ ‘ఆది పురుష్’ ముందు సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ పూర్తవగానే.. ‘ఆది పురుష్’ సినిమా మొదలు పెట్టి కొంత టాకీ పార్ట్ పూర్తి చేస్తారట. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తయిన తరవాతే నాగ అశ్విన్ సినిమా మొదలవుతుందని తాజా సమాచారం. ఇలా ప్లాన్ మారడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.
‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా. కాబట్టి కొంత టాకీ పార్ట్ పూర్తయితే దానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఆ కారణంగానే ‘ఆదిపురుష్’ ముందు మొదలవనుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కాగా ‘ఆదిపురుష్’ ముందు మొదలైనా రిలీజ్ అయ్యోది మాత్రం నాగ అశ్విన్, ప్రభాస్ సినిమానే అంటున్నారు.