ఏపిలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. శనివారం నుండి రాష్టంలో ఎన్నికల కోడ్ అమలు అమలు అవుతుందని ఎస్ఈసీ ప్రకటించారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మఒడి పధకం నిధుల విడుదల ఆగిపోతాయని ప్రచారం జరుగుతుండటంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో అమ్మఒడి పధకం అమలుపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పధకం యధాతధంగా అమలు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 విడుదల చేశామని చెప్పారు. 44,08,921మంది తల్లులకు అమ్మఒడి పధకం కింద రూ.6,161కోట్ల రూపాయలు సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేస్తారని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే లు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి సురేష్ వెల్లడించారు.