Maniratnam: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించే విషయంలో దర్శకులు పనితీరు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పూర్తిగా క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు షూట్ చేస్తుంటారు. కానీ క్లాస్ సినిమాలతో మాస్ ఆడియన్స్ నీ మెప్పించే నైపుణ్యం కలిగిన డైరెక్టర్.. మణిరత్నం. ఇండియాలో చాలా మంది స్టార్ హీరోలు కనీసం ఒక్కసారైనా మణిరత్నం సినిమాలో చేయాలని బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ప్రేమకథలు తీయడంలో మణిరత్నం స్టైలే వేరు. మణిరత్నం సినిమా చూస్తున్నంత సేపు ఒక సముద్రం ఒడ్డు తీరాన కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించే రీతిలో.. సినిమాని ప్రేక్షకులకు సినిమా ధియేటర్ లో కూర్చోబెట్టి అటువంటి ఫీల్ కలిగిస్తాడు. అయితే ఇటువంటి డైరెక్టర్ మణిరత్నం కోసమే తాను ఇండస్ట్రీలోకి వచ్చి నట్లు… ఆయన సినిమాలో హీరోయిన్ గా నటిస్తే చాలు అని డ్రీమ్ తో… 2011లో.. ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అని హీరోయిన్ ఆదితి రావు లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగిందని చివరాకరికి మణిరత్నం సినిమాలో నటించినట్లు..స్పష్టం చేసింది. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్కడా కూడా నిరుత్సాహం చెందకుండా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇండస్ట్రీలో రాణించి..మణిరత్నం సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కించుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అథితి రావు స్పష్టం చేయడం జరిగింది. “కాట్రు వెలియిడై” అనే సినిమా 2017 లో వచ్చింది. రొమాంటిక్ వార్ నేపథ్యంలో మణిరత్నం స్టోరీ రాయడం జరిగింది. ఆదితి రావు… ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో అప్పట్లో నటించింది. ఆదితి రావు పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ రీతిగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా నటించడానికే..వచ్చినట్లు ఆదితి రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.