ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై గట్టి పోరాటమే చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మరోవైపు కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా ఉండనుంది.
కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి గ్రస్తులకు, చికిత్స చేసిన ఆసుపత్రులకు కూడా ఆరోగ్య శ్రీ కింద లాభం చేకూర్చనున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఛార్జ్ చేయకుండా ఒక క్యాప్ ను కూడా సెట్ చేసారు. దీని ప్రకారం కరోనా ట్రీట్మెంట్ పేరుతో లక్షలకు లక్షలు గుంజడానికి లేదు. కరోనా వైరస్ తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కు ఎంత వసూలు చేయాలి అన్నది నిర్ణయించారు.