కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సింగం సిరీస్ లో వచ్చిన సినిమాల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి. కాగా తాజాగా సూర్య నటించిన తమిళ సినిమా సూరారై పోట్రూ ఓటీటీ లో రిలీజైంది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో రిలీజైంది. మంచు మోహన్ బాబు కీలక పాత్ర లో కనిపించారు. ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇంతకముందు వెంకటేష్ తో గురు సినిమాని తెరకెక్కించిన సుధ కొంగర వెంకటేష్ భారీ హిట్ ఇచ్చారు. ఇదే సినిమా ముందు తమిళంలో మాధవన్ నటించి హిట్ అందుకున్నాడు. ఆ కారణగా సూర్య నటించిన సూరారై పోట్రూ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకి తగ్గట్టే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే కొంతమంది ఈ సినిమా మీద కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన సినిమాలన్ని సక్సస్ టాక్ తెచ్చుకోలేదు.
దాంతో ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఈ సినిమాని కంటిన్యూ అవుతుందని భావించారు. కానీ అలాంటి వాళ్ళందరికి గట్టి షాక్ తగిలింది. ఆంచనాలకి భిన్నంగా మంచి టాక్ తో రన్ అవుతోంది. అయితే సినిమా ఇలా హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా సూర్య ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుందట. ఇంత మంచి సినిమాని అనవసరంగా ఓటీటిలో రిలీజ్ చేశారని ఫీలవౌతున్నారట. ఇదే గనక థియోటర్స్ లో రిలీజై ఉంటే రికార్డుల మోతే ఉండేదని సూర్య తొందరపడ్డాడని అంటున్నారు. ఏదేమైన చాలా కాలానికి సూరూ కి మంచి కమర్షియల్ హిట్ దక్కడం అందరికి ఉత్సాహాన్నిస్తోంది.