దిశా చట్టాన్నిమొట్టమొదటి గా ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకొక ఆడగు ముందుకు వేస్తూ మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అన్ని జగన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం యాప్ ను వర్చ్యువల్ విధానంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతూ ఉందని, మహిళలు, చిన్నారుల రక్షణ కోసమే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.ఆటోలు, క్యాబ్ లలో ఆడవారు నిర్భయం గా ప్రయాణం చేయడానికి ఈ డివైసెస్ ను ఆటో లు క్యాబ్ లలో ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఆర్ధిక, రాజకీయ స్వావలంబన కలిగించడానికి, మహిళలకు రక్షణ కల్పించడానికి రాజి లేకుండా పనిచేస్తూన్నామని పేర్కొన్నారు.
ఆటోలు, క్యాబ్ లలో కొత్త డివైసెస్:
మహిళలు రక్షణ లో భాగంగా ఆటోలు, క్యాబ్ లలో అభయం యాప్ కు సంభందించిన కొత్త పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని వల్ల మహిళలు ప్రయాణించేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అన్ని జగన్ అన్నారు. మహిళలు ప్రయాణించేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఆటో లో ఉన్న డివైస్ లో ఉన్న ప్యానిక్ బటన్ నొక్కడం తో అభయం యాప్ ద్వారా రవాణా శాఖ పోలీస్ లకి సమాచారం అందుతుంది. ఈ సమాచారం తో పోలీసులు ఆటోను ట్రేస్ చేసి 10 నిమిషాలలో చేరుకుంటారు. ఈ డివైస్ల ను మొట్టమొదటిసారిగా 1000 వాహనాలలో ఏర్పాటు చేస్తున్నట్లు, వచ్చే సంవత్సరం నవంబర్ నాటికీ లక్ష వాహనాలలో ఏర్పాటు చేస్తామని పేరుకొన్నారు.
డివైస్ లేని ఆటో లో మొబైల్ తోనే:
డివైసెస్ అమర్చని ఆటో లలో మొబైల్ లో అభయం యాప్ ద్వారా కూడా రక్షణ పొందవచ్చు. మహిళలు తమ మొబైల్ ఫోన్స్ లో అభయం అప్ ను ఇన్ స్టాల్ చేసి లాగిన్ అవవచ్చు. ఆటో, క్యాబ్ ఎక్కేటప్పుడు అభయం యాప్ లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో నెంబర్, ఆటో డ్రైవర్ వివరాలు యాప్ లో నమోదు అవుతాయి. ఏదీ అయ్యిన ఇబ్బంది అనిపించినపుడు ఈ అప్ ద్వారా సమాచారం అందించ్చవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మొత్తం ప్రాజెక్ట్ విలువ 138.48 కోట్లు. దశలవారీగా రాష్ట్రం లో లక్ష వాహనాలకు ట్రాకింగ్ డివైస్ ల ను అమర్చి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.