బాలీవుడ్ ప్రముఖ నటులల్లో అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు. ఈయన రెఫ్యూజీ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. కాని ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయినా ఆ సినిమాలో హీరోగా తన నటనతో అభిషేక్ బచ్చన్ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఈ హీరో ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. అయినా అందులో ఏ ఒక్క సినిమా అభిషేక్ బచ్చన్ కు గుర్తింపు తీసుకురాలేదనే చెప్పుకోవచ్చు.
కాని 2004 లో ధూమ్ సినిమాతో అభిషేక్ బచ్చన్ గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ హిందీలో ఎన్నటికీ గుర్తుండిపోయే మంచి గుర్తింపును అందుకుంది. ఆ తరువాత అభిషేక్ చాలా సినిమాల్లోనే నటించారు. 2009 లో ఈయన నిర్మించిన పా అనే సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా పురస్కారం కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభిషేక్ థ్రిల్లర్ సినిమా బాబ్ బిస్వాస్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభమయ్యింది. అభిషేక్ బచ్చన్ కహానీ చిత్రంలోని కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్రలో ఇతను నటించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కహానీ చిత్రంలోని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ గా బిస్వాస్ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఆ మూవీలో బెంగాలి ప్రముఖ నటుడు సస్వతా ఛటర్జీ ఆ పాత్రను పోషించాడు. ఇప్పుడు తెరకెక్కుతున్నబాబ్ బిస్వాస్ చిత్రంలో ఈ పాత్రలో అభిషేక్ నటిస్తున్నాడు. ఆ పాత్రకోసం అభిషేక్ ఫుల్ స్లీవ్ చొక్కా, పెద్ద కండ్లద్దాలు, మిడ్ పార్టీసియన్ హెయిర్ స్టైల్ తో దిగిన అభిషేక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
ఈ మూవీ షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంపై తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సుజోయ్ ఘోష్ కూతురు డియో అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఈ సినిమాలో షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా కోల్ కతాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో కథానాయికగా చిత్రంగ్డా నటించబోతున్నారు. కరోనా వైరస్ ను ధృష్టిలో ఉంచుకుని అది అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ తెలిపింది.