అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఏఈఈ సురేష్ రెడ్డి నివాసంపై ఏబిసి అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.
సురేష్ రెడ్డి చాల కాలంగా మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి వద్ద పిఎగా పని చేశారు. జెసి పదవిలో ఉన్నా లేకపోయినా సురేష్ ఆయనకు సేవలు అందిస్తుంటారని సమాచారం.ఏసిబి డిఎస్పి నాగభూషణం నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడు కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.
గత ఏడాది మార్చి నెలలో సురేష్ రెడ్డిని పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టు చేయగా స్టేషన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు.
ఇటీవల కాలంలో రెండు పర్యాయాలు జెసి దివాకరరెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టిఎ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. జరిమానా వేసి వదిలివేసే పిటీ కేసులకు సైతం అధికారులు బస్సులను సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జెసి ఇటీవల ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?