NewsOrbit
జాతీయం న్యూస్

Privatization : శరవేగంతో ప్రైవేటీకరణ!ఈసారి టార్గెట్ నాలుగు జాతీయ బ్యాంకులు!ఖాతాదారుల గుండెల్లో బాంబులు!

Privatization : ఏది దొరికితే దాన్ని ప్రైవేటీకరణ చేసేయటానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యవహారం పై రచ్చ రచ్చ జరుగుతున్నా కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు.తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Accelerated privatization! This time the target is four national banks!
Accelerated privatization! This time the target is four national banks!

అయితే ఆ సమయంలో ఆ నాలుగు బ్యాంకుల పేర్లను వెల్లడిచంకపోయినా.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ప్రభుత్వం ప్రైవేటీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ నాలుగు బ్యాంకులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నాయి. ఈ బ్యాంకులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బ్యాంకింగ్‌ రంగంలో మొదటి దశ, ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంపై ఎక్కువ దృష్టి సారించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని, ఆ డబ్బును ప్రభుత్వ పథకాలపై ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. 2021-22లో పెట్టుబడుల నుంచి రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశంలో రెండో అతిపెద్ద చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Privatization : ఖాతాదారులు కంగారుపడక్కర్లేదు!

బ్యాంకుల ప్రైవేటీకరణ కారణంగా కస్టమర్లలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగు బ్యాంకుల్లో ప్రస్తుతం 2.22 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో తక్కువ మంది సిబ్బంది ఉన్నందున దాని ప్రైవేటీకరణ సులభంగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అయితే బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై బ్యాంకర్లు గత రెండు రోజులుగా సమ్మె చేపట్టారు. ప్రైవేటీకరణ చేయవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాము ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుందని బ్యాంకింగ్‌ సేవలు మునుపటిలాగే కొనసాగించాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఈ సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్ గురువారం అన్నారు.

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju