టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుటపడింది. జిజిహెచ్ నుండి బుధవారం ఆయన డిశ్చార్జి అయ్యారు. నేరుగా విజయవాడలో సబ్ జైలుకి తరలించారు. కార్మిక శాఖా మంత్రిగా ESI మందుల కొనుగోళ్ళ కుంభకోణంలో ఈయన పాత్ర ఉందంటూ గత నెల 12న అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం బాలేని సమయంలో.., మొలల ఆపరేషన్ జరిగిన వెంటనే అరెస్టు చేయడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.
దీంతో ప్రభుత్వం శ్రద్ధ వహించి, ఈయనకు ప్రత్యేక చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం అచ్చెన్నాయుడు పూర్తిగా కోలుకున్నారు. సాధారణ స్థితికి చేరుకుని.., నడవగలుగుతున్నారు. ఆయన ఆరోగ్యంపై జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇవ్వడంతో పరిశీలించిన అధికారులు, ఆయనను డిశ్చార్జి చేసి మళ్ళీ విజయవాడ సబ్ జైలుకి తరలించారు.