నివార్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరియటిస్తూ ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నేడు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు.
నివార్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని తెలిపారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ పరియటిస్తుండగా అపశృతి తలెత్తింది. పామర్రు మండలం కనుమూరు వద్థ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పవన్ కళ్యాణ్ ర్యాలీ లో భారీ వాహనాలు పవన్ వాహనాన్ని అనుసరిస్తుండగా రెండు కార్ల మధ్య ఒక జనసేన కార్యకర్త బైక్ ఇరుక్కుంది. ఫలితంగా బైక్ పై వెళుతున్న కార్యకర్త కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ కార్యకర్తని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.