(నెల్లూరు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ఏపి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి లకు పెను ప్రమాదం తప్పింది. వీరు నెల్లూరు జిల్లా మర్పిపాడు మండలం కృష్ణాపురంలో జరిగిన సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్న సందర్భంలో వీరి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
మర్రిపాడు మండలం డీసి పల్లి టోల్ ప్లాజా సమీపంలో మంత్రుల కాన్వాయ్లోని ముందు వాహనానికి ఒ బైక్ అడ్డంగా రావడంతో డ్రైవర్ షడన్ బ్రేక్ వేశాడు. దీనితో కాన్వాయ్లో ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో మంత్రులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మంత్రులు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు.