Acham Naidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానే హోమంత్రిని అవుతానన్నారు.
చంద్రబాబును కోరి హోంశాఖ తీసుకుంటానని చెప్పారు. అప్పుడు అందరి అంతు చూస్తానన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కొద్దిగా వెనక్కి వెళ్తే అచ్చెన్నాయుడుకు పోలీసులపై కోపం ఉండడంలో ఆశ్చర్యం లేదు.ఈఎస్ఐ కుంభకోణంలో కూడా అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన తీరు వివాదాస్పదమైంది.ఆయన ఇంటి గోడలు ఎక్కి పోలీసులు లోపలికి ప్రవేశించి తెల్లవారుజామున అరెస్టు చేయడమే కాకుండా ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడును పోలీసు వాహనంలో ఎక్కడా ఆపకుండా గుంటూరు తీసుకొచ్చేశారు.దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కాగా ఆయన ఆస్పత్రిలో కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.అలాగే అచ్చెన్నాయుడుకు బెయిల్ రాకుండా కూడా పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేశారు.దాదాపు రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.తాజాగా నిమ్మాడ ఎపిసోడ్ తో మళ్లీ పోలీసులు ఆయనకు షాకిచ్చారు.దీంతో ఆయన కోపం అవధులు దాటింది. స్థానిక పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు.కాగా మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Acham Naidu : నిమ్మాడలో ఏం జరిగింది?
నిమ్మాడ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా అచ్చెన్న సతీమణి బరిలోకి దిగారు. మరోవైపు అచ్చెన్నాయుడి సోదరుడి కొడుకు అప్పన్న వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించారు. ఇక్కడే వివాదం రాజుకుంది. అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ను చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా ఖండించారు.
నిమ్మాడ ఏమన్నా అచ్చెన్నాయుడు జాగీరా!
ఇక నేడు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లనున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు.నిమ్మాడ అంటే చంద్రబాబు నీకు రాసిచ్చిన దివాణమా అచ్చెన్నా? అని విజయసాయి ప్రశ్నించారు. మీరు ఆదేశించిన వ్యక్తి తప్ప మరొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అని నిలదీశారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా లేదూ? అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేశారు.