Acharya : ఆచార్య సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల శివ తన సాధించిన ట్రాక్ రికార్డ్ తో ఏకంగా ఇండస్ట్రీ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ప్రభాస్ తో మిర్చి..ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించి భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. మంచి రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కొరటాల శివ డైరెక్టర్ గా కూడా తన స్టామినా ఏంటో చూపించాడు.
కొరటాల శివ చెప్పే కథ లో సామాజిక అంశాలు .. హీరో తాలూకు కమర్షియల్ అంశాలతో సినిమాని తీసి భారీ హిట్ సాధించాడు. చెప్పాలంటే ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. మాస్ ఇమేజ్ కోరుకునే ప్రతీ హీరోకి కావాల్సింది ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టరే. అందుకే టాలీవుడ్ లో ప్రతీ స్టార్ హీరో ఇప్పుడు కొరటాల శివ తో సినిమా చేయాలని తాపత్రయపడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ లతో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ కానుకగా ఆచార్య మే 13 న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు.
Acharya : ఆచార్య సినిమా ఇలాగే ఉంటే అంచనాలను అందుకోవడం కష్టమే ..?
అయితే రీసెంట్ గా ఆచార్య సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ మెగాస్టార్ స్టామినాకి తగ్గట్టుగా లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు కొరటాల శివ పట్టు టీజర్ లో కనిపించలేదని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారట. సినిమా కూడా ఇలాగే ఉంటే అంచనాలను అందుకోవడం కష్టమే అన్న మాట కూడా వినిపిస్తోందని చెప్పుకుంటున్నారు. మరి మెగా అభిమానులను ఇలా డిసప్పాయింట్ చేస్తే మాత్రం ఆచార్య సినిమా విషయంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకి సమాధానం దర్శకుడు కొరటాల శివ నే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.