ఆచార్య .. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత chiranjeevi నుంచి వస్తున్న aachaarya సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. సంక్రాంతి కి చిన్న బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం మళ్ళీ వచ్చేవారం నుంచి సెట్స్ మీదకి రానున్నారు.
అయితే ఇన్నాళ్ళు aachaarya సినిమాలో రామ్ చరణ్ పాత్ర కొన్ని నిముషాలు మాత్రమే అని ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. కాని ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక దాదాపు 30 నిముషాలు ఉండేలా ram charan పాత్ర ని పెంచారు. అది కూడా చాలదన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కాని ఇందులో మార్పులుండవనే భావించారు. కాని మెగా ఫ్యాన్స్ కి పూనకాలొచ్చే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. aachaarya సినిమాలో చరణ్ పాత్ర ఎంత సేపు ఉండబోతుందో వెల్లడైంది.
ఇటీవల దర్శకుడు కొరటాల శివ aachaarya సినిమాలో రామ్ చరణ్ పాత్ర ని 1 గంట సేపు ఉండేలా మార్పులు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. chiranjeevi – ram charan లను కలిపి డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. వారిని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానని కొరటాల శివ ఆతృతగా చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతుండగా త్వరలోనే ‘ఆచార్య’ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. సమ్మర్ లో ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆచార్య భారీ మల్టీస్టారర్ అని అందరికీ తెలీసందే. కాని పాన్ ఇండియన్ సినిమానా కాదా అన్నది క్లారిటీ రావడం లేదు.