Acharya : ఆచార్య .. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా సాగుతోంది. కాజల్ అగర్వాల్ చిరంజీవి కి జంటగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ స్థాయిలో టెంపుల్ సెట్ ని నిర్మించి చిత్రీకరణ జరుపుతున్నారు. దేశంలోనే ఇంత పెద్ద భారీ సెట్ నిర్మించడం ఆచార్య సినిమా కే కావడం విశేషం. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
కాగా మే 13న ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఆచార్య సినిమా మీద భారి స్థాయిలో అంచనాలు పెరిగాయి. అందుకు కారణం ఆచార్య టీజర్ ముఖ్య కారణం అని చెప్పాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి చూపించబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. కాగా ఆచార్య సినిమా చిత్రీకరణ దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం ఆచార్య షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మారేడు మిల్లి ప్రాంతంలో జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ తో పాటు రాం చరణ్ కూడా పాల్గొనబోతున్నాడు.
Acharya : ఆచార్య ఆచార్య … మెగాస్టార్ మెగాస్టార్ ఒకటే అరుపులు.. కేకలు.
అయితే ఇప్పటికే చరణ్ మారేడు మిల్లి చేరుకోగా తాజాగా మెగాస్టార్ కూడా మారేడు మిల్లి కి చేరుకున్నారు. దాంతో ఈ విషయం తెలిసిన అక్కడి వారు మెగాస్టార్ ఏయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుంచే ఘనంగా స్వాగతం పలికారు. ఆచార్య ఆచార్య … మెగాస్టార్ మెగాస్టార్ ఒకటే అరుపులు.. కేకలు. మెగా అభిమానులు మెగాస్టార్ మీద పూల వర్షం కురిపించారు. కాగా ఈ ప్రాంతంలోనే రీసెంట్ గా అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు.