Acharya: కరోనా ప్యాండమిక్ నుంచి కాస్త పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత టాలీవుడ్లో వరుసగా సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ డేట్ లాక్ చేసుకొని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల మధ్య భారీగానే పోటీ నెలకొంటోంది. దాంతో ఒకేసారి రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయి. అలాగే వారం గ్యాప్ లేకుండానే సినిమాలు రిలీజ్ చేయాలని ఆరాట పడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు సేఫ్సైడ్గా తమ సినిమాలకు అంత పోటీ లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలకు రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి వస్తోంది. వాస్తవంగా సర్కారు వారి పాట, గని చిత్రాలు అలా పోస్ట్పోన్ చేసుకున్నవే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారబోతోందనే టాక్ ఈ మధ్య మొదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
Acharya: మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు..
ఈ సినిమాకు కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేయబోతున్నారని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఆచార్య బృందం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆచార్య చిత్రాన్ని ముందు ప్రకటించిన తేదీ ఫిబ్రవరి 4న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తాజాగా తెలిపిన అప్డేట్లో పేర్కొన్నారు. దీనితో ఆచార్య సినిమా రీషూట్ విషయంలో రిలీజ్ డేట్ మారనుందనే విషయంలో వచ్చినవన్ని పుకార్లని తేలిపోయింది.