ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో అనుమతి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మీడియాకి అనుమతి లేకుండా సరి కొత్త జీవో జారీ చేయడం జరిగింది. దీంతో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా తీసుకుని నిర్ణయం తాజాగా వైసీపీ సర్కార్ తీసుకోవటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నట్లు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ఉంటే పిచ్చి తుగ్లక్ పాలన చర్యలు బయటపడతాయి ఏమో అన్న భయంతో అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడం లేదని అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు.
పాఠశాలలు అదేవిధంగా మద్యం షాపులు ఓపెన్ చేయడానికి అడ్డు రాని కరోన నిబంధనలు అసెంబ్లీలో మీడియా పాయింట్ కు అడ్డు వస్తున్నాయా అని మండిపడ్డారు. మీడియా అంటే ఎందుకు అంత భయం నీ బండారం బయటపడుతుందా ? ప్రజాస్వామ్యంలో మీరు తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ ఉంటారు అనే భయం నెలకొంది అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అచ్చెన్నాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో మీడియా ప్రాంగణంలోకి మీడియాని అనుమతించాలని సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి పై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడటం దారుణమని అచ్చం నాయుడు పేర్కొన్నారు.