ప్రముఖ సినీ హాస్య నటుడు ఆలీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. ఆలీని రాష్ర ప్రభుత్వ (ఎలక్ట్రానిక్ మీడియా) సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఇవేళ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆలీ.. వైసీపీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేశారు. తొలుత ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనను వైసీపీ ప్రచారానికి ఉపయోగించుకుంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆలీకి మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. జగన్ సర్కార్ ఆయనకు ఏదో ఒక మంచి నామినేటెడ్ పోస్టు ఇస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు రాజ్యసభకు కూడా ఆయన పేరు పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. కొద్ది నెలల క్రితం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన ఆలీ త్వరలో గుడ్ న్యూస్ అందుతుందని తెలిపారు. దీంతో అప్పట్లో రాజ్యసభ అభ్యర్ధిత్వం ఖరారు చేస్తారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఉందని ప్రచారం జరిగింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నరేళ్లు దగ్గర అవుతున్నా ఆలీకి ఏ పదవీ లభించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించి కొందరు తనపై కావాలనే కుట్ర చేస్తున్నారనీ, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పదవుల కోసం తాను వైసీపీ లో చేరలేదని చెప్పుకొచ్చారు. పదవులు ముఖ్యం కాదనీ, జగన్ మనసులో స్థానమే ముఖ్యమని ఆలీ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ మైనార్టీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
ఆ కుటుంబాలకు వచ్చే నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్