చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన గొల్లపూడి మారుతీరావు… దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లో రాక ముందు నాటకాలు, నవలలు, కథలు కూడా రచించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనూ పనిచేశారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?