కొందరికి పిచ్చి ఎక్కువ అవ్వడంతోనో.. లేక పబ్లిసిటీ కోసమో కానీ .. మనం నలుగురిలో ఉన్నాం.. ఏది చేయాలి ? ఏది చేయొద్దు అనే విషయాలను కూడా మర్చిపోతుంటారు. విచ్చల విడిగా ఏదో ఒకటి చేస్తూ.. దాన్ని కూడా అందరికీ తెలిసేలా వాళ్లే పబ్లిసిటీ చేసుకుంటుంటారు. నెటిజన్ల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటూ.. చేసిన తప్పులను మళ్లీ మళ్లీ చేసి నెజిజన్ల ఆగ్రహానికి గురవుతూ.. వస్తుంటారు.
ఇలాంటి కోవకు చెందిన వాడిగా.. మిలింద్ సోమన్ ను చెప్పుకోవచ్చని పలువురు అంటున్నారు. గోవా బీచ్లో ఇంటిపై నూలు పోగులేకుంగా పరుగులు పెట్టి సంచలనం సృష్టించిన ఈ సినీ నటుడు.. మళ్లీ అలాంటి వాటినే కంటిన్యూ చేస్తున్నాడు. దీనికి నిదర్శనమే ఈ మధ్య ఆయన భార్యతో దిగిన ఫొటోలు. ఈ ఫొటోలో రొమాంటిక్ గా ఫోజులు ఇవ్వడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ యాక్టర్ మిలింద్ సోమన్.
మోడల్, బాలీవుడ్ నటుడిగా మిలింద్ సోమన్ పలు చిత్రాల్లో నటించాడు. ఈయన ఈ మధ్య గోవాలో తెగ హల్చల్ చేస్తున్నాడు. గోవా బీచ్లో నగ్నంగా పరుగులు పెట్టి సంచలనం సృష్టించాడు. దీంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు సోమన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కానీ నేనేమీ పట్టిచుకోను అన్నట్లు ఈ యాక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొత్తగా తన రెండో భార్యతో అర్ధనగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చాడు ఈ నటుడు.వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
మిలింద్ తన భార్య అంకితా కొన్వర్ తో గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తగా పోస్ట్ చేసిన ఫొటోల్లో భార్య అంకితా కొన్వర్తో కలిసి రొమాంటిక్ గా ఫొటోలకు ఫోజులిచ్చాడు ఈయన. హాయిగా సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ విటమిన్ D ని స్వీకరిస్తున్నామంటూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు కేసు పెట్టినా ఈయనలో మార్పు రావడంలేదంటూ విమర్శిస్తున్నారు.
మిలింద్ సోమన్ వయసు 55 ఏళ్లు, ఆయన భార్య అంకితా కొన్వర్ వయస్సు 28 ఏళ్లు. వీరిద్దరి ఫొటోలను చూస్తున్న నెటిజన్లు.. మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ కేసు విషయంపై మిలింద్ ఎప్పుడు మాట్లాడుతారో.. అలాగే పోలీసులు ఈయనపై ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.