Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ గత నెల 28వ తేదీన చెన్నై చేరుకోగానే అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులోని నరాలు చిట్లడంతో చికిత్స అందించారు. మెదడు లోని రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్ ను ప్రోసీజర్ ద్వారా తొలగించారు. ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స అందిన తరువాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో నిన్న రాత్రి రజనీకాంత్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు తలైవా. తన ఇంట్లో దేవుడి ముందు దేవుడి ముందు ప్రార్ధన చేస్తున్న ఫోటోను రజనీ షేర్ చేశారు. తలైవా పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి చేరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More: Pawan Kalyan: ఏపి పార్లమెంట్ సభ్యులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..
Rajinikanth: గత ఏడాది డిసెంబర్ లోనూ
ఇదిలా ఉంటే..గత ఏడాది డిసెంబర్ లో షూటింగ్ కు వెళ్లిన సందర్బంలో అస్వస్థకు గురైయ్యారు. దీంతో వెంటనే హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అలసట, రక్తపోటు లో హెచ్చుతగ్గులకు చికిత్స అందించిన వైద్యులు ఆయనను కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల నేపథ్యంలో నాడు తన ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయ పార్టీ ఏర్పాటును ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు రజనీకాంత్. దీంతో ఎంతో కాలంగా రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట ఎంతో ఆశపెట్టుకున్న తలైవా అభిమానులు నిరుత్సాహ పడ్డారు.
Read More: AP Govt: ఏపి డిప్యూటి సీఎం నారాయణ స్వామికి సర్కార్ షాక్..! మేటర్ ఏమిటంటే..?
4న ‘అన్నాతై’ విడుదల
ఇక రజనీకాంత్ మువీ విషయానికి వస్తే ..రజనీకాంత్ తాజాగా నటించిన ‘అన్నాతై’ మువీ నిర్మాణం పూర్తి అయ్యింది. నయనతార, కీర్తి సురేష్, మీనా, కుష్బూ తదితరులు ముఖ్య పాత్ర పోషించగా, ఇది ఈ నెల 4 వ తేదీన ప్రైక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల అవుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు.
Read More: Badwel By Poll: బద్వేల్ బై పోల్ ..! 28 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్..?
Returned home 🙏 https://t.co/35VeiRDj7b
— Rajinikanth (@rajinikanth) October 31, 2021